ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ను ముంబయిలో ప్రత్యేకంగా కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అమిర్ ఖాన్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ, ఆయనతో కొంతసేపు చర్చలు జరిపారు. ఈ అకస్మాత్తు భేటీకి సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. అమిర్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సితారే జమీన్ పర్” పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీ బడ్జెట్తో “మహాభారతం” అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకోవాలని అమిర్ భావిస్తున్నాడని గతంలోనే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బన్నీని ప్రత్యేకంగా కలవడం, ఆయనతో సమాలోచనలు జరపడం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసమే అయి ఉంటుందనే టాక్ బాలీవుడ్, టాలీవుడ్లో ట్రెండ్ అవుతోంది. ఇది నిజమయితే మాత్రం అల్లు అర్జున్ మరియు అమీర్ ఖాన్ అభిమానులకు కనుల పండుగ అనే చెప్పొచ్చు.
ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదుగానీ, ఈ భేటీ భారత దేశ సినీ అభిమానులను తీవ్ర ఆసక్తిని, ఉత్కంటను రేకిట్టిస్తున్నది. ఒకవేళ ఇది నిజమైతే, అల్లు అర్జున్ “మహాభారతం” లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ సర్కిళ్స్లో హాట్ టాపిక్గా మారింది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి