5, నవంబర్ 2024, మంగళవారం

Helmet Awareness : "క్షేమంగా ఇంటికి రా నాన్నా..!"...హెల్మెట్ వినియోగంపై ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం

Helmet Awareness :   ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం
                          దేశంలో ప్రతిరోజూ జరుగుతున్న రహదారి ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. రహదార్ల నిర్వహణ లోపం, తగిన సామర్ధ్యం లేని వాహనాలు, పరిమితికి మించి రవాణా, సరైన రహదారి భద్రత చర్యలు తీసుకోక పోవడం ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ద్విచక్ర మోటార్ వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వినియోగించకపోవడం వలనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై ఎంతగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ తగిన స్పందన రావడం లేదు. రోడ్డు ప్రమాద మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో చేస్తున్న వినూత్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టు కోవడంతోపాటు, ఆలోచింప చేస్తున్నది. రోడ్డు ప్రమాదాలలో పూర్తిగా ధ్వంసం అయి ఎందుకు పనికిరాకుండా పడి ఉన్న వాహనాలను నేషనల్ హైవేలో తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో రోడ్డుకు పక్కగా నిలిపి ఉంచుతున్నారు. ఆ వాహనాల వద్ద " నాన్న..పది నిముషాలు ఆలస్యమైన పర్వాలేదు..క్షేమంగా ఇంటికి రండి " అన్న ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న పిల్లల ప్రచార చిత్రాలు ఏర్పాటు చేసారు. భావోద్వేగాలతో ముడిపడిన ఈ తరహా వినూత్న ప్రచారం వాహన దారులను, ప్రయాణీకుల హృదయాలను హత్తుకుంటుంది. 


                    ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ అనంతరం మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు మరియు పోలీస్ సిబ్బంది మీడియా సిబ్బంది ఉద్యోగస్తులు ఉద్యోగ నిర్వహణకు వెళ్ళే సమయాలలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హితవు పకికారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను జరిమానాలతో శిక్షించడమే కాకుండా ముందుగా వారికి హెల్మెట్ వలన కలిగే లాభాలను గురించి అవగాహనను కల్పిస్తామని తెలిపారు. ఇంటికి రావడంలో 10 నిమిషాలు ఆలస్యమైనా ఏమీ పర్వాలేదు గాని ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఆ కుటుంబానికి ఎనలేని నష్టం కలిగి, అతనిపై ఆధారపడిన మొత్తం కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రయాణం చేయాలని, రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని విజ్ఞప్తి చేసారు.
                                         ఇంతలో హైవేలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై తన కుటుంబ సభ్యులతో వెళుతుండడం గమనించి.. అతనికి మరియు అతని భార్యకి కూడా హెల్మెట్ ను తన చేతుల మీదుగా అందించి హెల్మెట్ యొక్క ఉపయోగాలను గురించి తెలియచేసారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని హితవు పలికారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుదీర్ బాబు, భీమడోలు ఎస్ఐ సుధాకర్, డిస్టిక్ ట్రాఫిక్ రికార్డు బ్యూరో కానిస్టేబుల్ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

3, నవంబర్ 2024, ఆదివారం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం
                                ఒకప్పుడు ఇంట్లో తినడం ఎక్కువ..బయట ఆహార పదార్థాలు తినడం బహు అరుదుగా ఉండేది. ఇప్పుడేమో బయట తినడం ఎక్కువైంది. అడుగడుగునా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన రెస్టారెంట్లు, హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొబైల్ క్యాంటిన్లు, మిర్చి బడ్డీలు, బేకరీలు ఇలా చాంతాడు అంత ఆహార కేంద్రాల చూపు తిప్పుకోకుండా ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే ఆగగలమా..? జంక్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు, పౌష్టికాహార నిపుణులు నెత్తి, నోరు బాదుకుని చెప్తున్నా తలకు ఎక్కించుకుంటున్నామా..? బిరియానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పానీ పూరీ, చాట్, పునుగులు, మిరపకాయ బజ్జీలు, పిజ్జా, బర్గర్ లతో పాటు రోజు రోజుకీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఆధునిక చిరుతిళ్ళ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాము. వీటి వల్ల కలిగే మానసిక, శారీరక సమస్యలు పట్టించుకోకుండా తాత్కాలిక జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాము.కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ లాంటి ఉదర సంబంధిత వ్యాధులతోపాటు ఇతర ఎన్నో వ్యాధులకు ఈ జంక్ ఫుడ్ కారణం అవుతుంది. 

                                     మన పూర్వీకులు సహజ సిద్ద కాషాయాలు తయారు చేసుకుని తరచుగా సేవించడం ద్వారా ఉదర ప్రక్షాళన చేసుకొనేవారు. ఆయుర్వేద, సహజ వైద్య ఆరోగ్య విధానాలపై విశ్వాసం ఉన్నవారు ఇప్పటికీ వాటిని అనుసరిస్తూ ఉపశమనం పొందుతున్నారు. అప్పుడప్పుడైనా ఈ సహజ సిద్ద కషాయలు తాగడం ద్వారా జంక్ ఫుడ్ తినడం వలన కలిగే అనర్థాలను కొంతైనా నివారించవచ్చని సిద్ద ఆచార్యులు చెప్తున్నారు. కషాయం అనేది ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే ఒక ఆవిరి పానీయం. ఇది తేనె, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ఔషధ గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. కషాయంలో ఉండే పదార్థాలు శరీరానికి చాలా లాభాలను అందిస్తాయి. 

కషాయం తయారీకి కావలసిన పదార్థాలు: 1. నీరు - 2 గ్లాసులు 2. అల్లం - 1 చిన్న ముక్క, సన్నగా తరిగినది 3. దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క 4. తులసి ఆకులు - 5-6 ఆకులు 5. పుదీనా ఆకులు - 4-5 ఆకులు (ఆప్షనల్) 6. మిరియాలు - 5-6 గింజలు 7. జీలకర్ర - 1/2 టీ స్పూన్ 8. తేనె - 1 టీ స్పూన్ (తర్వాత చల్లారిన తర్వాత కలపాలి)

తయారీ విధానం: 1. మొదట ఒక గిన్నెలో 2 గ్లాసుల నీరు తీసుకుని మరిగించాలి. 2. నీరు మరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, పుదీనా ఆకులు (వుంటే), మిరియాలు, జీలకర్ర వేసి మళ్లీ కొంచెం మరిగించాలి. 3. ఇది సగం వరకు మరిగిన తర్వాత దించుకోవాలి. 4. చల్లారిన తర్వాత, కషాయంలో తేనె కలపాలి.

కషాయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
1. జలుబు, దగ్గు నయం: ఈ కషాయం తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. అల్లం, తులసి, మిరియాలు శ్వాస రోగాలను దూరం చేస్తాయి. 

2. జీర్ణశక్తి మెరుగుపడుతుంది: జీలకర్ర, అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. 

3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి రక్షణను అందిస్తుంది. 

4. శరీరం డిటాక్సిఫై చేస్తుంది: దాల్చిన చెక్క, పుదీనా వంటివి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. 

5. వేడిని  తగ్గిస్తుంది: అల్లం, మిరియాలు శరీరంలోని వేడిని  తగ్గిస్తాయి. శీతాకాలంలో, ఈ కషాయం తాగడం చాలా మంచిది.

2, నవంబర్ 2024, శనివారం

Traditional Tips For Strong Teeth : ధృఢమైన దంతాల కోసం సాంప్రదాయ చిట్కాలు

                      దంతక్షయం..ప్రతి చోట, ప్రతి నోట తరచుగా వినిపిస్తున్న మాట..ప్రతి ఇంట ఎవరో ఒకరిని బాధిస్తున్న సమస్య..పిప్పి పళ్ళు, పళ్ళు విరగడం, చిగుళ్ళ వాపు, రక్తం కారడం, నోటి దుర్వాసన ఇలా పంటికి సంబంధించిన సమస్యలు ఎన్నో. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ పంటి వ్యాధులు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా విపరీతంగా పెరుగుతున్నాయని ఎన్నో వైద్య అధ్యయనాల ద్వారా వెల్లడవుతున్నాయి. ఆధునిక పోకడలు, ఆహారపు అలవాట్లకు దూరంగా పెరిగిన మన పూర్వీకులలో ఈ దంత సమస్యలు అంతగా బాధించలేదు అన్నది వాస్తవం. ఈనాటికీ అనేక మంది వృద్దులలో పంటి సమస్య అంటే తెలియని వారు ఎందరో. తాము బాల్యం నుండి అనుసరించిన సాంప్రదాయ దంత సంరక్షణ విధానాలే తమకు దంత సిరిని తెచ్చి పెట్టాయని వారు గర్వంగా చెపుతుంటారు..ప్రస్తుత ఆధునిక యుగంలో ఆ సంప్రదాయ విధానాలు ఆచరించడం కష్టతరం అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 

                                   దృడమైన, ఆరోగ్యవంతమైన దంతాల కోసం మన పూర్వీకులు అనుసరించిన విధానాలు తెలుసుకుందాం. ఇక్కడ పళ్ళను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సంప్రదాయ భారతీయ సహజ పద్ధతులు వివరించబడ్డాయి. 


ఈ సహజ పదార్థాలు దంత ఆరోగ్యం పెంపొందించడంలో దోహదపడతాయి: 

1. ఆయిల్ పుల్లింగ్ పదార్థాలు: నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పద్ధతి: ప్రతి రోజు ఉదయాన్నే ఒక చెంచా నూనెను నోట్లో వేసుకుని 10-15 నిమిషాల పాటు కలుపుతూ ఉంచి, తర్వాత ఉమ్మేయాలి. ఇది బ్యాక్టీరియా తగ్గించి, ప్లాక్ నివారించడంలో సహాయపడుతుంది. 

2. వేప కొమ్మలు వేపలో ఉండే సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పళ్ళకు, గడ్డాల ఆరోగ్యానికి చాలా మంచివి. వేప కొమ్మను నమిలి, దంతాలు శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్ళకు ఆరోగ్యవంతమైన సంరక్షణ అందుతుంది. 

3. లవంగ నూనె పదార్థాలు: లవంగ నూనె పద్ధతి: కొద్దిగా లవంగ నూనెను గడ్డాలపై స్వాబ్ లేదా కాటన్ ద్వారా అప్లై చేయండి. లవంగం సహజ యాంటీసెప్టిక్ గుణాలతో గడ్డాల ఉబ్బరం తగ్గించి, బ్యాక్టీరియాను అరికడుతుంది. 

4. ఉప్పు మరియు ఆవ నూనె మసాజ్ పదార్థాలు: ఉప్పు మరియు ఆవ నూనె పద్ధతి: కొద్దిగా ఉప్పును కొన్ని చుక్కలు ఆవ నూనెతో కలిపి, చిగుళ్ళపై మసాజ్ చేయండి. ఇది గింజివిటిస్‌ను నివారించి, చిగుళ్ళను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

5. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం మిశ్రమం పదార్థాలు: బేకింగ్ సోడా మరియు నిమ్మరసం పద్ధతి: బేకింగ్ సోడా మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేసి, పళ్ళపై అప్లై చేయండి. ఇది పళ్ళపై మరకలను తొలగించి, పళ్ళను తెల్లగా చేయడంలో సహాయపడుతుంది. ఇది వారానికి ఒకసారి మాత్రమే చేయడం మంచిది. 

6. ఆమ్లకీ (ఉసిరికాయ) ఆమ్లకీలో ఉండే విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు చిగుళ్ళ ఆరోగ్యం పెంపొందించడంలో సహాయపడతాయి. ఉసిరికాయ జ్యూస్ లేదా పొడిని తింటే దంతాలు, చిగుళ్ళు బలంగా మారుతాయి. 

7. తులసి ఆకు తులసిలో సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. తాజా తులసి ఆకులను నమిలి లేదా పొడిగా చేసుకుని దంతాలకు పేస్ట్ లాగా ఉపయోగించవచ్చు. 

8. జామాకులు సున్నితమైన జామాకులను నమిలితే గడ్డాల ఆరోగ్యం మెరుగవుతుంది. జామాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. 

9. హల్దీ పేస్ట్ పదార్థాలు: పసుపు పొడి మరియు నీరు పద్ధతి: పసుపు పొడిని నీటితో కలిపి పేస్ట్ తయారు చేసి పళ్ళపై, గడ్డాలపై అప్లై చేయండి. ఇది ప్లాక్ ని తగ్గించి, గడ్డాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. 

10. పండు, కూరగాయల నమిలటం మిరపకాయలు, జామ, కీర వంటి పండ్లు నమిలితే పళ్ళు సహజంగా శుభ్రపడతాయి. అలాగే, గడ్డాలు బలంగా మారి, బ్యాక్టీరియా తగ్గేలా చేస్తుంది. ఈ సహజ పద్ధతులను పాటించడం ద్వారా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

31, అక్టోబర్ 2024, గురువారం

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children
                              మారం చేయకుండా తింటారని, బుద్దిగా ఒక చోట కూర్చుంటారని, తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకపరచరని తదితర కారణాలతో పిల్లలకు మొబైల్ ఫోన్స్ అందించడం అన్నది ప్రతి ఇంట్లోను సర్వ సాధారణ విషయం అయిపోయింది. ఈ అలవాటును మాన్పించకుంటే..అది పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పిల్లల వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం తెలియని వయసు కావడంతో వారు అవాంచిత సమాచారాన్ని గ్రహించే ప్రమాదం ఉంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అనేక నేరాలు, ఘోరాలలో పెరుగుతున్న మైనర్ ల పాత్రకు ఇదీ ఒక ప్రధాన కారణంగా ఆయా దర్యాప్తు, విచారణ సమయాలలో వెల్లడవుతుంది. పిల్లలు కుదురుగా ఉంటున్నారన్న ఒక్క కారణంగా ఈ విపరీతాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు రేపటి వారి పిల్లల భవిష్యత్ ను చీకటి మయం చేస్తున్నామన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. 

                                      ఇటీవల జరిగిన కొన్ని భయంకర నేరాలలో కరడుగట్టిన పాత నేరస్తుల పాత్ర ఉంటుందని పోలీసు అధికారుల అంచనాలను తల క్రిందులు చేస్తూ మైనర్ బాలల పాత్ర నిర్ధారణ అయి విస్తుగొలిపిన కేసులు ఎన్నో..ఎన్నెన్నో..ఇప్పటికైనా ఈ పిల్లల మొబైల్ అతి వినియోగం జాడ్యం పై తగిన పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ దుష్పరిణామాలు స్వయంకృతాపరాధమే అవుతాయి. 

ఈ అలవాటు మాన్పించడానికి మానసిక నిపుణులు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు: 

1.స్క్రీన్ టైమ్ పరిమితులు ఏర్పరచండి : ప్రతి రోజూ మొబైల్ వినియోగానికి సమయం పరిమితం చేయండి, ముఖ్యంగా వినోదం కోసం. ఇది ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేందుకు సమయ నియంత్రణ సెట్టింగ్స్ లేదా పెరెంటల్ కంట్రోల్ యాప్‌లను ఉపయోగించండి. 

2.  ఇతర అలవాట్లు, కార్యకలాపాలకు ప్రోత్సహించండి : క్రీడలు, పుస్తకాలు చదవడం లేదా హస్తకళల వంటి ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు ప్రోత్సహించండి. పిల్లలు ఆసక్తికరమైన ఇతర విషయాలలో పాల్గొంటే, వారు మొబైల్‌కు ఎక్కువగా ఆకర్షించబడరు. 

3.  "డివైస్-ఫ్రీ" జోన్స్‌ను సృష్టించండి : కుటుంబ భోజనాలు లేదా నిద్రకు ముందు వంటి సమయంలో మొబైల్‌ లేనటువంటి ప్రత్యేక స్థలాలను లేదా సమయాలను ఏర్పాటు చేయండి. ఇది మొబైల్ వినియోగానికి ప్రత్యామ్నాయాన్ని ఇస్తుంది. 

4. మీరు రోల్ మోడల్ అవ్వాలి : మీరు కూడా మొబైల్ వినియోగాన్ని పరిమితంగా ఉంచుతూ పిల్లలకు తగిన ఆదర్శంగా ఉండండి. పిల్లలు చాలా సందర్భాలలో తల్లిదండ్రుల అలవాట్లను అనుకరిస్తారు. 

5.  విద్యా సామగ్రిని పరిమితంగా ఉపయోగించండి : విద్యా సంబంధిత యాప్‌లు, కంటెంట్‌ను అపరిమితంగా కాకుండా, తగ్గించి ఉపయోగించండి. ఇది వారు విద్యా ఉద్దేశ్యంతో మొబైల్ ఉపయోగాన్ని పరిమితంగా అనుభవించడానికి తోడ్పడుతుంది. 

6.  సామాజిక పరస్పర చర్యలకు ప్రోత్సహించండి : స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలుసుకునే అవకాశాలు కల్పించండి. ముఖాముఖి పరస్పర చర్యలు పిల్లలకు అవసరమైన సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో మరియు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉండకుండా చేయడంలో సహాయపడతాయి. 

 ఈ మార్గదర్శకాలు మొబైల్ వినియోగాన్ని ఆరోగ్యంగా, సమతుల్యతగా ఉంచడంలో పిల్లల పెంపొందనకు తోడ్పడతాయి.

30, అక్టోబర్ 2024, బుధవారం

ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india

ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india
సాంకేతిక పరిజ్ఞానం అన్నది ఇరువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధం. అది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది..ఉన్మాది చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది..ఫలితం దాన్ని మనం వినియోగించుకొనే విధానంలోనే ఉంటుంది. జూదం అన్నది మహా మహులు, మహనీయులు అయిన వారిని కూడా ఎంతగా దిగాజార్చిందో, ఎంతగా ఇబ్బందులపాలు చేసిందో అనాదిగా మనకు రుజువు అవుతూనే ఉన్నది.పేకాట, మట్ఖ, కోడి పందాలు ఇలా బెట్టింగ్ కి ఎన్నో రూపాల, అవకాశాలు. టెక్నాలజీ అంతగా అభివృద్ధి సాధించని రోజుల్లో,జూదానికి చట్టపరమైన అవరోధాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ వ్యసనం పరిమితుల్లో ఉండేది. నేటి ఆధునిక కాలంలో క్రికెట్, టెక్నాలజీ ప్రాచుర్యం పొందడంతో ఆన్ లైన్ బెట్టింగ్ ఊపు అందుకుందని చెప్పొచ్చు. అన్ని సౌలభ్యాలు సెల్ ఫోన్ తో చేతిలో ఉన్న ప్రస్తుత కాలంలో ఎన్నో ఎన్నెన్నో అధికారిక, అనధికారిక బెట్టింగ్ యాప్స్..ప్రజలలో విపరీత ఆదరణ ఉన్న సెలబ్రిటీలు సైతం తమ ఆదాయం, స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించడం ఎన్నో అనర్ధాలకు హేతువు అవుతుంది.స్కూల్ కు వెళ్ళే స్టూడెంట్ నుండి కోట్ల లో వేర్షిక వేతనాలు అందుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుని విల విల లాడుతున్నవారే. తేలికగా డబ్బు సంపాదించాలని, ఆకస్మికంగా ధనవంతులు కావాలన్న దురాసతో అప్పులపాలు అవుతున్నారు.అటు అప్పులు తీర్చలేక, ఇటు ఆ వ్యసనం నుండి బయట పడలేక, తీవ్ర ఒత్తిడి మానసిక వేదనకు గురై ఆత్మహాత్య వంటి ప్రయత్నాలు చేస్తున్న విషాద ఘటనలు కోకొల్లలు. ఈ ఘటనలలో విద్యార్థులు, యువత అధికంగా ఉండడం గమనార్హం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తగు పరిశీలనలో ఉండడం, వారితో ఎప్పటికప్పుడు సానుకూలంగా మాట్లాడు తుండడం బెట్టింగ్ వ్యసనం ను ముందుగానే గుర్తించడం ద్వారా వారిని సంరక్షించుకొనే అవకాశాన్ని కలిగి ఉండొచ్చు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలన ప్రధాన సమస్యలు : 1. వ్యసనం: ఆన్‌లైన్ బెట్టింగ్ చాలా వ్యసనపరమైనది, ఇది ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలకు దారి తీస్తుంది. 2. ఆర్థిక నష్టం: బెట్టింగ్ వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు వస్తాయి, అప్పులు మరియు ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. 3. భద్రతా సమస్యలు: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండకపోవచ్చు, వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తాయి. 4. నియంత్రణ లేకపోవడం: కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు నియంత్రించబడకపోవచ్చు, ఇది సరసమైన ఆటను నిర్ధారించడం మరియు వినియోగదారులను రక్షించడం కష్టతరం చేస్తుంది. 5. సామాజిక ఒంటరితనం: అధిక ఆన్‌లైన్ బెట్టింగ్ సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పరస్పర అనుబంధాలను ప్రతికూలంగా మారుస్తుంది. 6. మానసిక ఆరోగ్యం: ఆన్‌లైన్ బెట్టింగ్ ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. 7. స్కామ్‌లు మరియు మోసం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు స్కామ్‌లు మరియు మోసాలకు గురయ్యే అవకాశం ఉంది, ఫలితంగా ఆర్థిక నష్టాలు వస్తాయి. 8. టైమ్ మేనేజ్‌మెంట్: ఆన్‌లైన్ బెట్టింగ్ గణనీయమైన సమయం హరించడం, పని, సంబంధాలు మరియు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 9. మద్దతు లేకపోవడం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు సమస్య జూదగాళ్లకు తగిన మద్దతు లేదా వనరులను అందించకపోవచ్చు. చట్టపరమైన సమస్యలు: కొన్ని అధికార పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం కావచ్చు, ఫలితంగా చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. ఈ ఇబ్బందుల గురించి తెలుసుకోవడం మరియు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో సంప్రదించడం చాలా అవసరం.

29, అక్టోబర్ 2024, మంగళవారం

కొత్త సైబర్ దందా "డిజిటల్ అరెస్ట్"..అప్రమత్తం!

కొత్త సైబర్ దందా "డిజిటల్ అరెస్ట్"..అప్రమత్తం! Digital arrest
అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సౌలభ్యాలు పొందుతున్నామో ..వాటితో పాటుగా ఎన్నో అనర్ధాలను కూడా చవి చూస్తున్నాము. ఇప్పటి వరకూ ఆదార్ వెరిఫికేషన్, పించన్ , లోన్స్ మంజూరు, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి ఒటిపి లు అడగడం ద్వారా నగదు గల్లంతు చేస్తున్న సైబర్ మాయగాళ్ళు ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే నయా సైబర్ దందాకు తెరతీసారు. ఈ తరహా మోసాలకు ఇప్పటికే భారతీయులు వందల కోట్లు నష్టపోయారు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన ఈ డిజిటల్ మోసాల ను అరికట్ట డానికి ప్రయత్నాలు ఆరంభించాయి. సైబర్ స్కామర్స్ సమాజంలో సంపన్న వర్గాలను, వృద్దులను, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, పోలీస్ అధికారులు, ఇన్కంటాక్స్ మరియు కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ... " మీ బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా నగదు నిల్వలు ఉన్నాయని, మీ పేరిట వచ్చిన పార్సిల్ లో డ్రగ్స్ దొరికాయని " ఆడియో వీడియో కాల్స్ ద్వారా బాధితుల్ని బెంబేలిస్తారు..వారికి దిక్కుతోచని పరిస్థితి కల్పించి, " మీరు పెద్ద మొత్తంలో నగదు ఇస్తే ఈ నేరంలోంచి బయట పడేస్తామని , ఆలస్యం చేసినా..ఎవరికైనా చెప్పినా తక్షణమే "డిజిటల్ అరెస్ట్ " చేస్తామని బాధితుల్ని బెదిరించి , ఆఘమేఘాలపై ఆన్ లైన్ చెల్లింపులు చేయించుకోవడం ద్వారా నగదు కొల్ల గొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులను నమ్మించడానికి, భయభ్రాంతులను చేయడానికి పోలీస్ స్టేషన్ , కోర్ట్ రూమ్ సెట్టింగ్స్ కూడా వేసి పకడ్భందీగా మోసాలు చేస్తున్నారు. బాధితుల్లో ఉన్నత స్థాయి ప్రముఖులు, ప్రొఫెసర్ లు , సైంటిస్ట్ లు , మేధావులు వంటి వారు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం రంగంలోకి దిగి తన "మన్ కి బాత్" కార్యక్రమం ద్వారా "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాలను ప్రస్తావించి, తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసారు అంటేనే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడమే ప్రధాన నివారణ మార్గంగా తలచిన ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ మోసాలపై అవగాహన మరియు జాగ్రత్తలు ఇప్పుడు డిజిటల్ యుగంలో మనం చాలా భాగం ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకుంటున్నాం, అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటున్నప్పటికీ, కొన్ని మోసాలు సైతం విస్తరించాయి. ఇటువంటి మోసాలు మనం సులభంగా బాధితులమై ఆర్థిక నష్టం చవిచూడే అవకాశముంది. ఈ నేపధ్యంలో డిజిటల్ మోసాల గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం. 1. ఫిషింగ్ మెసేజ్‌లు: ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా, మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వివరాలను చోరించడానికి ప్రయత్నిస్తారు. ఈ సందేశాలు సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల పేరు మీద ఉంటాయి. ఒకవేళ మీకు సందేహం ఉన్న సందేశం వస్తే, దాన్ని నేరుగా క్లిక్ చేయకుండా, దాని నిజస్వభావం తెలుసుకునే ప్రయత్నం చేయండి. 2. OTP మరియు పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు: బ్యాంకులు, UPI పేమెంట్ అప్లికేషన్లు ఎప్పుడూ మీ పాస్‌వర్డ్ లేదా OTP గురించి అడగవు. ఎవరికైనా ఈ వివరాలు అందించడం చాలా ప్రమాదకరం. మీ ఖాతాలు, ట్రాన్సాక్షన్‌ మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచండి. 3. నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్లు: నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. సురక్షితమైన ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండే యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదమైన లింక్ క్లిక్ చేయడానికి ముందే దాని నిజమైన URLను జాగ్రత్తగా పరిశీలించండి. 4. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: ఏదైనా మోసానికి గురైతే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. జాగ్రత్తగా మరియు సురక్షితంగా ఉండటం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ________________________________________ ఈ సూచనలు పాటించడం ద్వారా మన డిజిటల్ లావాదేవీలు మరింత భద్రంగా ఉంటాయి.